సిరా న్యూస్,అదిలాబాద్;
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థినీలు సుమారు 40 మంది ఇంటర్ పరీక్షలు రాయడానికి నడుచుకుంటు ప్రమాదకర దారిలో వెళుతున్న వైనాన్ని చూసిన భారత్ జాగృతి ఎన్జీవో మండల కన్వీనర్ మైళ్ళ మహేష్ కుమార్ స్పందిచారు. సంబంధిత పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ప్రిన్సిపల్ లలిత తో మాట్లాడారు. విద్యార్థినీలను సెంటర్ల వద్ద విడిచి పెట్టి పరీక్ష ముగిశాక తిరిగి తీసుకు వచ్చేలా రెండు వాహనాలను ఏర్పాటు చేశారు మొన్న నిమిషం ఆలస్యం కావడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసి ఈ వాహనాల ఏర్పాటును చేయడం జరిగిందని అయన అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పరిక్ష కేంద్రాల వరకు విద్యార్దులనుతరలించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కడమంచి భీముడు, సుంకే అనిల్ కుమార్,తోగరి రాజశేఖర్, ఈదుల్ల రాకేష్, తది తరులు పాల్గొన్నారు.