గ్రీన్ హోమ్స్ కాలనీలో సిసి కెమెరాలను ప్రారంభించిన మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి

సిరా న్యూస్,రంగారెడ్డి;
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వీటితో నేరాలను కట్టడి చేయవచ్చని మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో 52 సిసి కెమెరాలను మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి కెవిపి రాజు కలిసి ప్రారంభించారు. అనంతరం డిసిపి మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్థులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు.ప్థానికులు తమ కాలనీలో జరిగే అసాంఘీక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేసి సహకరించాలని సూచించారు.సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు. కాలనీలో పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థ ఉండడంతో కాలనీవాసులు భద్రమైన భరోసా ఉంటుందన్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *