సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శుక్రవారం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి,శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోభాగంగా శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారుఏ. బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలునిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండోరోజు నుంచి అనగా ఈనెల 13 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు,వాహనసేవలు నిర్వహిస్తారు. ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతిపురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు,మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో పెడ్డిరాజుతెలిపారు.శుక్రవారం నుంచి 18 వరకు ప్రత్యక్ష,పరోక్ష సేవలైన రుద్రహోమం,చండీ హోమం,మృత్యుంజయహోమం,సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం,శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదలచేస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.