వర్గీకరణ కు వ్యతిరేకంగా హలో మాల ఛలో బాపట్ల ని విజయవంతం చేయండి

-రంగయ్య

 సిరా న్యూస్,కర్నూలు;
మాలల భావి తరాల భవిష్యత్ కోసం వేలాదిగా బాపట్ల కు తరలిరండి-మల్లేష్

*యస్ సి వర్గీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమనికి సిద్ధంకండి – జై భీమ్ యువదళం జిల్లా అధ్యక్షులు నల్లన్న

యస్ సి వర్గీకరణ కు వ్యతిరేకంగా బాపట్ల లో మూడవ తారీకున జరిగే మాలల సింహం గర్జనకు వేలాదిగా మాలలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని జై భీమ్ మాలమహానాడు రాష్ట్ర నాయకులు సి. రంగయ్య పిలుపునిచ్చారు. ఇటీవలే వర్గీకరణ పై సుప్రీం తీర్పు వాయిదా వేయడం జరిగింది అని కేంద్రం అండదండలతో గతంలో వేసిన కమిషన్లు జడ్జిమెంట్ లను పరిగణలోకి తీసుకోకుండా అత్యున్నత న్యాయ స్థానం ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరం అని జైభీమ్ మాలమహానాడు రాష్ట్ర నాయకులు రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాలల లో చైతన్యం చేయడానికి మాలమహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు బాపట్ల లో నిర్వహించు మాలల సింహం గర్జన సభ ను వేలాది గా మాలలు తరలి వచ్చి విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు మాల మల్లేష్ పరమేష్ తెలిపారు.మందకృష్ణ మాదిగ కేంద్రం అండదండలతో సుప్రీం లో పోరాటం చేస్తే మా మాలలు రాజ్యాంగ బద్దంగా పోరాటం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా మాలలు పోరాటం చేస్తున్న మల్లెల వెంకట్రావు చెన్నయ్య రామ్ ప్రసాద్ మరింత మందికి ఆర్థికంగా సహరిస్తే మాత్రం తప్పకుండ విజయం సాధిస్తారని యువదళం జిల్లా అధ్యక్షులు నల్లన్న బలరాం రాముడు ఆశభావం వ్యక్తం చేసారు. కర్నూలు జిల్లా తరుపున భారీ ఎత్తున బాపట్ల కు వెళ్తున్నట్లు మాలమహానాడు నాయకులు తెలిపారు కార్యక్రమం లో రాజోలప్ప మల్లేష్ పరమేష్ నల్లన్న బలరాం రాముడు నర్సింహా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *