సిరా న్యూస్;
టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
రేపు చిలకలూరిపేట నియోజకవర్గం లో జరగబోయే ప్రజాగళం భారీ బహారంగసభ కి సంబంధించి సన్నాహక సమావేశం స్థానిక పద్మావతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త యడవల్లి విశ్వనాధ్,1వవార్డ్ తెలుగుదేశం కౌన్సిలర్ పిచ్చికే నాగార్జున జనసేన నాయకులు పిడతల సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చారిత్రాత్మక సంచలనం ప్రజాగళం మీటింగ్ అని రేపు చిలకలూరిపేట మండలం బొప్పూడి లో జరగబోవు సభకు నంద్యాల నియోజకవర్గ నుంచి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి రావాలని పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా జగన్ కు కౌన్ డౌన్ స్టార్ట్ అయిందని ఈ ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి , జనసేన నాయకులు పబ్బతి రవి, గుల్లి , హరి , సందీప్, సాయి జయంత్, అమర్నాథ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.