ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పాదయాత్రను విజయవంతం చెయ్యండి

సిరా న్యూస్,పరవాడ;
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని సొంత గనులు కేటాయించాలని విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఆదివారం ఆరు గంటల కి కూర్మన్నపాలెం జంక్షన్ నుండి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ముగిస్తుందని ఈ పాదయాత్రకు సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఎన్ టి పి సి మెయిన్ గేట్ వద్ద కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో ఒక్క ప్రవర్తనంగా పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరించడం లేదా అమ్మేయాలి నిర్ణయించడం దుర్మార్గం అన్నారు. పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఉపాధి రహిత అభివృద్ధి అవుతుందని దీనివల్ల పెట్టుబడిదారులు లాభాలు గడించడం తప్ప కార్మికులకు ప్రజలకు ఉపయోగపడేది ఏమీ ఉండదని అన్నారు ఉత్తరాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవడానికి కార్మికులు ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని గని శెట్టి పిలుపునిచ్చారు. ఈ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి .గోవిందరాజు, పి పి నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *