prank videos : భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా  ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య

– టీటీడీ
అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు
సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ  యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయ మైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది.వివరాల లోకి వెళ్తే నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియో ని రూపొందించగా, కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి  ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో  సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది.
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్  డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే  తిరుమల కంపార్ట్మెంట్లలో, వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ  వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు  దెబ్బ తిన్నాయి.ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *