సిరాన్యూస్, ఉట్నూర్
ఎమ్మెల్యేను కలిసిన మాల మహానాడు సభ్యులు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేను పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరుపున పిటిషన్ దాఖలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.క్లిమిలేయర్ అమలు చేయడం ద్వారా ఎస్సీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు .ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.