మాల్దీవ్స్ మంత్రి మరియం షియున సోషల్ భారత్ కు క్షమాపణలు

సిరా న్యూస్,న్యూ డిల్లీ;
;సస్పెండయిన మాల్దీవ్స్ మంత్రి మరియం షియున సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు. భారత త్రివర్ణ పతాకాన్ని కించపరిచే ఇమేజ్ ను ఆమె ఇదివరలో షేర్ చేశారు. అది ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ పోస్ట్ నుతర్వాత డిలీట్ చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షం దీనిపై రచ్చరచ్చ చేసింది. అక్కడ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.మరియ షియును మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయుజ్జు అధికార పార్టీకి చెందినవ్యక్తి. ఆమె సోషల్ మీడియా నుంచి తన పోస్ట్ ను తొలగించడమే కాకుండా ఇప్పుడు ప్రజలన మద్దతును కోరుతున్నారు. ‘ఎండిపి మద్దతును కోల్పోతోంది.మాల్దీవ్స్ ప్రజలు కూడా ఆ పార్టీతో
పడిపోవాలనుకోవడంలేదు’అని పోస్ట్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *