మల్కాజ్ గిరిలో ఈటలను గెలిపించాలి

బీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదు
కిషన్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈటెల రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరు ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీలో ఉంది. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవాలి. తెలంగాణలో 12కు పైగా స్థానాలను గెలుస్తున్నాం. బీజేపీకు బీఆర్ఎస్ బీ టీం అంటున్నారు.. మేము ఎవరికి బీ టీం కాదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అనేది లేదు.. వాళ్లకి ఒక్క సీట్ రాకపోయిన ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. దీన్ని ఎవరు ఆపలేరు. ఐక్యమత్యంగా పని చేద్దాం. మల్కాజ్ గిరిలో ఈటెలను గెలిపిద్దాం. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్టానం చెప్పింది. నామినేషన్ తరువాత అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేయాలి. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నాం అనేది వివరించాలి. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మనకు ఢోకా లేదు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడం లేదని అన్నారు.
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో వంశీ తిలక్ ను గెలిపించాలి. #అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించాడు వంశీ. కంటోన్మెంట్ ఎన్నికలు కూడా మనకు కీలకం.. అసెంబ్లీ సీటును కూడా గెలవాలి.. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. ఈటెల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడానికి.. లోక్ సభ ఎన్నికలు మొదటి అడుగని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *