సిరాన్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో సీఎం, మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినా మాట ప్రకారం రైతులకు మొదటి దశలో లక్ష రూపాయల నగదు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలంలోని మల్లారం బస్టాండ్, అంబేత్కర్ చౌరస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచ ను కాల్చారు.ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.