సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఏడిసిసి మేనేజర్ మల్లెపూల రవీందర్ కు ఘన సన్మానం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ఎడిసిసి బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా గుడిహత్నూర్ బ్రాంచ్ కు వెళ్ళనున్న మల్లెపూల రవీందర్ ను జైనథ్ పిఎసిఎస్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఈ మేరకు బ్యాంకులో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జైనథ్ పిఎసిఎస్ కార్యదర్శులు గంగన్న, సుశీల్, కుమార్, ప్రశాంత్, ఆఫీస్ సబార్డినేట్ ధనియాల్, తదితరులు ఆయనకు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం స్థానిక నాయకులు గడ్డం జగదీశ్ రెడ్డి, రమేష్ రెడ్డి, కొడిచర్ల సుదర్శన్, మేస్రం రాజేశ్వర్, తదితరులు సైతం మేనేజర్ రవీందర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికలు బహుకరించి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ… 2017 నుండి జైనథ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తాను, అందరి సహకారంతోనే బ్యాంకు ను లాభాల బాటలో నడిపించడం జరిగిందని అన్నారు. సిబ్బంది, నాయకులు తనపై చూయించిన ఆదరాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.