సిరాన్యూస్, చిగురుమామిడి
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మామిడి అంజయ్య
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త గడ్డం రాజయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య పరామర్శించారు. మృతిని కుమారులైన గడ్డం ఆంజనేయులు, గడ్డం నాగరాజు, గడ్డం మహేష్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కుంటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. పరామర్శించిన వారిలో నాయకులు నాగేల్లి రాజిరెడ్డి, కాటం హనుమంత రెడ్డి, బండారుపల్లి రమేష్, చంద్రబోయిన శ్రీనివాస్, మంద లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.