సిరా న్యూస్,బాసర;
బాసర గోదావరి నది రైల్వే బ్రిడ్జి పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయాన్ని అక్కడే స్నానం చేస్తూ గమనించిన బిదరెల్లి ఆంజనేయ స్వాములు, పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే బాసర ఎస్సై గణేష్ స్నందించారు. పో్లీసులు ప్రాణాలకు తెగించి గంగపుత్రుల సహాయం తో వ్యక్తి ని కాపాగారు.బాధితుడు నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన సుభాష్ వాగ్మారే (52) గా గుర్తించారు. పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.