సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరిదాస్ పల్లి లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిదాస్ పల్లి లో గ్రామంలో సుదర్శన్ నూతనంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. అనుమతి లేకుండా రొడ్డు వదులకుండా ఇళ్లు నిర్మించాడని నిర్మాణంలో ఉన్న సుదర్శన్ ఇంటిని అధికారులు కూల్చివేసారు. మనస్థాపంతో పొలం దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఉరివేసుకుని సుదర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. .అధికారుల వేధింపులతోనే సుదర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకుల ఆరోపణ. సుదర్శన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించాయి.
==================