Manala Shekhar:బీజేవైఎం జిల్లా అధ్యక్ష బ‌రిలో మనాల శేఖర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్:
బీజేవైఎం జిల్లా అధ్యక్ష బ‌రిలో మనాల శేఖర్
బీజేవైఎం జిల్లా అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన గుడిహత్నూర్ జడ్పీటీసీ బ్రహ్మానంద్ ను రాష్ట్ర నాయకత్వం బీజేపీ జిల్లా అధ్యక్షులు గా నియమించింది. దింతో బీజేవైఎం జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆ పదవికి తీవ్రపోటి నెలకొంది. బోథ్ మండలం సాకేరా గ్రామానికి చెందిన మనాల శేఖర్ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మనాల శేఖర్ ఏబీవీపీలో 7 సంవత్సరాలు విద్యార్థుల కోసం ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేసాడు. ఏబీవీపీలో క్రియశీలకంగా పని చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు.బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షలుగా బాధ్యత చెప్పట్టిన సంవత్సరంలోని లోనే చురుగ్గా పనిచేస్తు అందరి మన్ననలు పొంది, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ అతని చురుకుధానానికి మెచ్చి బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి గా కొనసాగుతున్న అతను బీజేవైఎం జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *