Mandagada: ఎప్రిల్‌ 5న మాండగాడలో మురళీ కృష్ణ విగ్రహా ప్రతిష్ఠాపన

సిరా న్యూస్, జైనథ్‌:

ఎప్రిల్‌ 5న మాండగాడలో మురళీ కృష్ణ విగ్రహా ప్రతిష్ఠాపన
+ ఎప్రిల్‌ 3 నుండి 5వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని మాండగాడ గ్రామంలో ఈనెల 5న శుక్రవారం శ్రీ మురళి కృష్ణాలయంలో విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు. ఎప్రిల్‌ 3 నుండి 5 వరకు మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3న ఉద్యం 8గంటలకు ప్రతిష్ఠా దంపతులచేత ఆలయ ప్రదక్షిణ, గణపతి పూజ, 12.30గంటల నుండి 4.30 గంటల వరకు హోమము, సర్వతోభధ్ర మండపారాధన, ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 4న ఉదయం 8గంటల నుండి స్వామి వారి విగ్రహానికి క్షీరా, జల, పుష్ప, ధన్యాదివాసం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5న 11.56 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి, తదితర పూజలు నిర్వహిస్తారు. కాగా ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *