సిరా న్యూస్, జైనథ్:
ఆలయ స్థల దాతను సన్మానించిన ముక్కెర ప్రభాకర్, గోదావరి దంపతులు..
ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మాండగడ గ్రామమంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ ఆలయానికి స్థలాన్ని దానం చేసిన టక్కూరి శోభ, నర్సింగ్ దంపతులను జైనత్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్ గోదావరి దంపతులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఈ మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి చీర, సారెలు సమర్పించారు. ఈ సందర్భంగా ముక్కెర ప్రభాకర్ మాట్లాడుతూ… దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ ముందుండి ఆ పరాత్ముని కృపకు పత్రులు కావాలని కోరారు. ఆలయం కోసం స్థలాన్ని దానం చేసిన దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మామిడి మల్లా రెడ్డి, సైపట్ మహేందర్ రావు, బండారి వినోద్, సైపట్ రమేష్ రావు, గంధం సురేష్, తదితరులు పాల్గొన్నారు.