సిరాన్యూస్, ఆదిలాబాద్
క్యాథ్ లాబ్స్ సేవలు ప్రారంభించడం అభినందనీయం
* గోవా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే
ఆదిలాబాద్ లాంటి పట్టణంలో క్యాథ్ లాబ్స్ సేవలు ప్రారంభించడం అభినందనీయమని గోవా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ ను స్థానిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కందిశ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర వైద్య పరీక్షల కోసం ఏ అవసరమున్నా నాగపూర్ , యవత్మాల్ హైదరాబాద్ లకు వెళ్లవలసి వచ్చేదని ప్రస్తుతం ఇక్కడ క్యాథ్ ల్యాబ్ సేవలు ప్రారంభించడం హర్షనీయమని కందిశ్రీనివాస రెడ్డి అన్నారు. వైద్య రంగంలో రాణించి ఇలాగే మంచి వైద్య సేవలందించి ఇంకా నాణ్యమైన అత్యాధునిక సేవలు అందించేలా ఎదగాలని యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి యజమాని డాక్టర్ అభిజిత్ నుర్గుర్ వార్ అతిథులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు,డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వామన్ రావు కసావర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ దిగంబర్ రావు పాటిల్ ,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,ఆనంద్ రావు,రషీద్,నాగర్కర్ శంకర్, కోరేటి కిషన్, బాయిన్ వార్ గంగా రెడ్డి, బూర్ల శంకరయ్య, యాల్ల పోతా రెడ్డి, చారి, రఫీక్, కయ్యుమ్, సుధాకర్ గౌడ్, నిమ్మల ప్రభాకర్,సుకేందర్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.