మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టితో మరింత అభివృద్ధి దిశగా మంథని నియోజకవర్గం

-నియోజకవర్గ అభివృద్ధికి రూ. 33 కోట్లు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

 సిరా న్యూస్,మంథని;
ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టితోమంథని నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నదని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మంథని మండల పరిషత్ అధ్యక్షుడు కొండ శంకర్ లు పేర్కొన్నారు. సోమవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మంథని మండల పరిషత్ అధ్యక్షుడు కొండ శంకర్ లు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఈ ప్రాంత వాసుల మన్ననలు పొందిన నాయకునిగా మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకు వస్తున్నారన్నారు. మంథని నియోజకవర్గానికి రూ 33 కోట్లు నిధులు తీసుకువచ్చారని దానిలో భాగంగానే మంథని మండలానికి రూ 7.57 కోట్లు మంజూరు అయ్యాయని మంథని మండలంలో చేపట్టే అభివృద్ధి పనులు మార్చి 25 లోపు పూర్తిచేసి నిధులు వెనుకకు పోకుండా మనమంతా చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం పనులు పూర్తి చేయించి ఆదర్శంగా నిలిచి మరో ప్రాంతానికి పోటీపడే విధంగా ఉండాలన్నారు. మంథని నియోజక వర్గంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని మంథని ప్రాంత అభివృద్ధి దిశగా ప్రత్యేకంగా నిధులు పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి కేటాయించారని అన్నారు. మండలంలో ఆయా గ్రామాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వేసవికాలం దృష్ట్యా రైతుల చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు త్వరితగతిన డబ్బులు చెల్లించేందుకు కృషి చేశామన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిరోజు అధికారులు నాయకులతో అభివృద్ధిపై శ్రీధర్ బాబు చర్చిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలు శివ, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, డిసిసి కార్యదర్శి కుడుదుల వెంకన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి జనగామ నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకుడు గోటికార్ కిషన్ జి, నాయకులు పెండ్లి ప్రభాకర్ రెడ్డి, పూదరి ఓదెలు, అక్కపాక సదయ్య, రాజేశ్వర్, గుమ్మడి రాజయ్య, ఎండి హైసన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *