-పారిశుద్ధ్యమే ప్రధాన ఏజెండా
-త్వరలో వార్డు సందర్శన కార్యక్రమం
-మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
రానున్న రోజుల్లో మంథని మున్సిపాలిటీ ని మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి హామీ ఇచ్చారు.బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వీధులను మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలలో ఉన్న సమస్యలను ప్రజలు చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు. మహాలక్ష్మి దేవాలయం ఏరియా, శ్రీపాద కాలనీ ,అంబేద్కర్ చౌరస్తా, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఏరియాలలో పారిశుద్ధ్యం మరియు త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. కాలనీలలో ఉన్న చెత్తాచెదారాలను మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డుల సందర్శన కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని ప్రతి వారం ఒక వార్డు గా కేటాయించుకొని అ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
=========================