-3.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణతో సరికొత్త రికార్డు
-అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
-మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
సిరా న్యూస్,మంథని;
వరి ధాన్యం కొనుగోలులో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం టాప్ లో నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా మంథని సహకార సంఘం కార్యాలయంలో సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించి అత్యధిక స్థాయిలో 3.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. రబీ – 2024 సీజన్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని పరిధిలో (37) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో వరి ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు తెలిపారు. సుమారు 4300 మంది రైతుల నుంచి 3,70,831.20 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తద్వారా సహకార సంఘం ద్వారా రూ.81.36కోట్ల వరి ధాన్యం వ్యాపారం చేశామన్నారు. రైతులను దళారుల భారి నుంచి ధగా పడకుండా కాపాడేందుకు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అప్పటి పౌర సరఫరాల శాఖ మాత్యులు, ప్రస్తుత ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో గ్రామగ్రామానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరూ ఇప్పించి రైతుల ముంగిట్లోనే కల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈసారి పక్కా ప్రణాళిక తో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైస్ మిల్లర్లు గతంలో క్వింటాళ్ కు రెండు మూడు కిలోల ధాన్యం కోత విధించేవారని, ఈసారి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మిల్లర్లు ధాన్యంలో ఒక్క గింజ కూడా కోత విధించకుండా చూశామన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ఈసారి ప్రశాంతంగా కొనుగోళ్లు జరిపామన్నారు. సంఘం పరిధిలో నిర్వహిస్తున్న (37) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మంథని ఏఎంసిలో 36520 క్వింటాళ్లు, గుంజపడుగు సెంటర్ ద్వారా 10970.40, పవర్ హౌస్ కాలనీ లో 15429, పుట్టపాకలో 9246.80, నాగారంలో 7895.20, విలోచవరంలో 9863.20,ఎక్లాస్ పూర్ లో 17306, ఖానాపూర్ లో 12570.80, గోపాల్ పూర్ లో 17410, నాగెపల్లిలో 18266.80, వెంకటాపూర్ లో 16816.40, లక్కేపూర్ లో 6466.40, మహాబూబ్ పల్లిలో 4012.80, శ్రీరాంనగర్ లో 9607.60, గుమ్నూరులో 2261.60, అక్కేపల్లిలో 5855, మల్లెపల్లిలో 5847.80, పోతారంలో 7145.20, ఆరెందలో 12000, అడవిసోమన్ పల్లి లో 10084.40, గంగాపురిలో 7351.40, గద్దలపల్లిలో 5370.40, చిన్నఓదాలలో 9930.80, బిట్టుపల్లిలో 7592, గాజులపల్లిలో 3959.60, కాకర్లపల్లిలో 9014.40, మైదుపల్లిలో 860, సిరిపురంలో 5936, నగరంపల్లిలో 5704, మల్లారంలో 7178.40, భట్టుపల్లిలో 5960.80, అంగ్లూర్ లో 9105.20, సూరయ్యపల్లిలో 6227.60, కన్నాలలో 26400, స్వర్ణపల్లిలో 11000, చిల్లపల్లిలో 5350, ఖాన్ సాయిపేట్ లో 8315.20క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. విజయవంతంగా కొనుగోళ్లు జరిగేలా సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, పౌర సరఫరాల శాఖ డిఎం, డిసిఎస్ఓ, సహకార శాఖ మానిటరింగ్ అధికారి ముఫాసిర్ అహ్మద్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు, సంఘ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, హమాలీలు, సంఘ సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.