సిరా న్యూస్, ఖానాపూర్
రామోజీరావు మరణం జర్నలిజానికి తీరని లోటు: సీనియర్ పాత్రికేయులు మంత్ర రాజం దేవేందర్
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం జర్నలిజానికి తీరని లోటని నిర్మల్ ఖానాపూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ సమన్వయకర్త సీనియర్ పాత్రికేయులు మంత్ర రాజం దేవేందర్ అన్నారు. శనివారం ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామోజీరావు పత్రికా రంగంలోనే కాకుండా వ్యాపార పరంగా, టీవీ రంగాల్లోనూ, సినిమా రంగంలోనూ రాణించి కష్టే ఫలి క్రమశిక్షణైవ జయతే నినాదానికి సూట్ అయిన వ్యక్తిగా పేరు గాంచారని తెలిపారు. రామోజీ ఈ లోకంలో లేకపోవడం బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పడాల లక్ష్మి నారాయణ, కార్యదర్శి కొమటి పల్లి, గోపి గౌరవ అధ్యక్షులు రాచమల్ల రాజశేఖర్ సిరిపురం నాగరాజులు పాల్గొన్నారు.