సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ పట్టణంలో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో పట్టణంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బందంలోకి వెళ్లాయి. దీంతో రోడ్డు పై నీటి గుంటలు ఏర్పడి వాహనా దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో స్కూలుకి వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు భారీ వర్షం ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.