సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ప్రముఖ సినీ నటి ధివిలు శ్రీవారి సుప్రభాత సేవలో వేర్వేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.