పసుమర్తి చందు పార్థివ దేహానికి పలువురు నివాళులు

సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తెలుగుదేశం నాయకుడు పెద్ద తాడేపల్లి మాజీ ఉపసర్పంచి పసుమర్తి చందు పార్థీవదేహానికి పలువురు నివాళులర్పించారు.పెద్ద తాడేపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది మాజీ ఉప సర్పంచ్ కిసికిస్తాన్ గుండెపోటుతో మరణించిన
పసుమర్తి చంద్రశేఖర్ (చందు) పార్థివదేహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ , ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల బాబ్జి , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపరాజు తదితరులు పెద్ద తాడేపల్లిలో చందు నివాసానికి చేరుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన చందు అభిమానులు చందుకు నివాళులర్పించారు.
బొలిశెట్టి శ్రీనివాస్ ,వలవల బాబ్జి , రామరాజు, మాట్లాడుతూ పసుమర్తి చందు గొప్ప నాయకుడు నిస్వార్థ సేవకుడు ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాల్ని తీర్చే వ్యక్తి తన సొంత ఆస్తుల్ని సైతం ధారబోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పసుమర్తి చందు అని పేర్కొన్నారు.ఆ కుటుంబానికి తాను , బాబ్జి తెలుగుదేశం జనసేన సభ్యులు అందరూ అండగా ఉంటామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, వసుమర్తి రామలక్ష్మణులు ,జనసేన పార్టీ అడపా ప్రసాద్ , పాలూరి వెంకటేశ్వరరావు ,బిజెపి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *