Manya Sri Kansiram: మాన్య శ్రీ కాన్షిరాంకు భారతరత్న ఇవ్వాలి

సీరా న్యూస్ భీమదేవరపల్లి
మాన్య శ్రీ కాన్షిరాంకు భారతరత్న ఇవ్వాలి
*తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మాన్య శ్రీ కాన్షిరాంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లోని దళిత, సామాజిక వర్గానికి చెందిన కాన్సీరామ్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర తో బయలుదేరి దేశ ప్రజలను మమేకం చేసి రాజ్యాంగఫలాలను ప్రజలకు వివరించారన్నారు..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కాన్సిరాం కు భారతరత్న ప్రకటించాలని దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కండె సుధాకర్, కొడముంజ బాలరాజు, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు పొన్నాల వినోద్ కుమార్, వేముల జగదీష్, కొంకటి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *