సిరాన్యూస్, సైదాపూర్:
మారవేణి శ్రీశైలంకు రూ.21వేలు అందజేసిన పదో తరగతి మిత్ర బృందం
మిత్రులు అంటే కేవలం సంతోషాలలో కాకుండా కష్ట సుఖాల్లోనూ తోడున్నామంటూ ఆదర్శంగా నిలిచిన సంఘటన శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…. లింగాపూర్ గ్రామానికి చెందిన మారవేణి శ్రీశైలం తన తల్లి చిన్నతనంలో, తండ్రి ఇటీవల చనిపోయారు. ఒంటరిగా మిగిలిన మారవేణి శ్రీశైలం మిత్రుడికి మేమున్నామంటూ జడ్పీహెచ్ఎస్ మెట్ పల్లి 2006-07 పదవ తరగతి మిత్ర బృందం ముందుకు వచ్చారు. మిత్ర బృందం అంతా కలిసి రూ.21వేలను మిత్రుడు మారవేణి శ్రీశైలం అందజేశారు. ఈసందర్బంగా మిత్ర బృందాన్ని గ్రామస్తులు, పలువురు అభినందించారు.