పిల్లలతోపాటు వివాహిత ఆత్మహత్య

సిరా న్యూస్,అన్నమయ్య;
రాయచోటి పట్టణం కొత్తపేట లో దారుణం జరిగింది. తన నివాసంలోనే తన ఇద్దరు పిల్లలతో కలిసి రమా(35) అనే వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. రమా, తన ఇద్దరు పిల్లలు మను(7), మన్విత(5) మంటల్లో కాలి చనిపోయారు. కొత్తపేటలోని తొగటవీది లో ఘటన జరిగింది.మృతురాలి భర్త రాజా జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్ కి వెళ్ళినట్లు సమాచారం. రమా కొత్తపేటలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అతని భార్య రాత్రి 10 గంటల సమయంలో రమా ఇంటికి వెళ్లి దాదాపు 5 గంటల సేపు రమా తో గొడవ జరిగిందని స్థానికులు అంటున్నారు.అవమానం భరించలేక తెల్లవారుజామున తన పిల్లలతో పాటు రమా పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *