Market Committee Chairman B Gangareddy: జయశంకర్ ఆశయాలను నెరవేర్చిన రోజే తెలంగాణకు న్యాయం

సిరాన్యూస్‌, బోథ్‌
జయశంకర్ ఆశయాలను నెరవేర్చిన రోజే తెలంగాణకు న్యాయం
* మార్కెట్ కమిటీ చైర్మన్ బి గంగారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యూహకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నెరవేర్చిన రోజే నిజమైన రాష్ట్రం వచ్చినట్లు అవుతుందని  బోథ్‌మార్కెట్ కమిటీ చైర్మన్ బి గంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మార్కెట్ కమిటీ ఆవరణలో జయశంకర్ జ్ఞాపకార్థం మొక్కను నాటడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఆశించిన అభివృద్ధి జరిగితేనే కల నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జి రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి చంటి ,మెరుగు భోజన్న, కురుమే గంగారం, రాజశేఖర్, శ్రీను మార్కెట్ కమిటీ చైర్మన్, విట్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *