Market Committee Shanigarapu Shravan : ప్లేట్లెట్స్ దానం చేసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శనిగరపు శ్రావణ్

సిరాన్యూస్‌,ఖానాపూర్‌
ప్లేట్లెట్స్ దానం చేసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శనిగరపు శ్రావణ్

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పటల్లో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న నిర్మల్ జిల్లా దిలవర్పూర్ కు చెందిన రమణకు ఎ బి,పాజిటివ్ ప్లేట్ లెట్స్ శుక్రవారం అత్యవసరం ఏర్ప‌డింది. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న‌ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖానాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శనిగరపు శ్రావణ్ హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి వెళ్లి ప్లేట్ లెట్స్ దానం చేసి గొప్ప మానవత్వం చాటారు. ఈ సంధర్బంగా శ్రావణ్ మాట్లాడుతూ ఏ దానం చేయాలన్న అది విద్య,విజ్ఞానం,డబ్బుతో ముడిపడి ఉన్నదని కానీ ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో మానవత్వంతో ముడిపడి ఉంద‌ని తెల‌పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ముఖ్యంగా యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్చందంగా రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని ఆయన యువతకి పిలునిచ్చారు.అలాగే ప్లేట్ లెట్స్ దానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడిన గొప్ప మానవతావాది శానిగారపు శ్రావణ్ ని గాజుల రవి, రాజ గంగన్న, కొక్కుల ప్రదీప్, కాలేరీ దివాకర్, సాబిర్ పాషాలతో పాటు పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *