సిరాన్యూస్, భీమదేవరపల్లి
24న హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా: మర్రి దేవరాజ్
ఈనెల 24 వ తేదీన హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాను యువతీ, యువకులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని భీమదేవరపల్లి మండలం వంగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి దేవరాజు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హతను బట్టి ప్రతి ఒక్కరు జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.