Marri Devaraja: రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి : వంగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి దేవరాజు

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి : వంగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి దేవరాజు

ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని వంగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి దేవరాజు కోరారు. భీమదేవరపల్లి మండ‌లంలోని  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. గత 10సంవత్సరాలో కరీంనగర్ అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది తప్ప అభివృద్ధి నోచూకోలేదు అన్నారు. 2009 అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదు అన్నారు. బోయినపల్లి వినోద్,బండి సంజయ్ లు చేసిన అభివృద్ధికి పొన్నం ప్రభాకర్ చర్చకు రామని పిలిస్తే తోక ముడుచుకొని వెళ్లిపోయార‌న్నారు.కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప‌ని చేస్తామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *