సిరాన్యూస్, భీమాదేవరపల్లి
వెలిశాల రాజేందర్ ను గెలిపించాలి : యూత్ అధ్యక్షుడు మర్రి దేవరాజు
వంగరలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర గ్యారంటీల కార్డుల పంపిణీ
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ ను గెలిపించాలని భీమదేవరపల్లి మండలం వంగర కాంగ్రెస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు మర్రి దేవరాజు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతోనే 100 రోజులు పూర్తికాకముందే ఆరు గ్యారెంటీలను అమలు చేసిందని, కేంద్రంలో అధికారం సాధిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం వంగర గ్రామంలో ఇంటింటికి కేంద్ర గ్యారంటీ కార్డు లను పంపిణి చేశారు.