సిరా న్యూస్,సైదాపూర్
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ది
* కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి అన్నారు. శనివారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి మాట్లాడుతూ వెన్నంపల్లి కొత్త ఎస్సీ కాలనీ నుండి పాత ఎస్సీ కాలనీకి కలుపుతూ నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామని చెప్పారు.గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 15లక్షలు, ఓపెన్ జిమ్ కొరకు 5లక్షలు, వాటర్ స్కీం కొరకు 2లక్షలు మంజూరు చేయడం పట్ల కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు అన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బిడి వివేకవర్ధన్ రెడ్డి, సారబుడ్ల రాజిరెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ నరేందర్ రెడ్డి, కుల సంఘం అధ్యక్షులు సంగాల తిరుపతి, మాజీ సర్పంచ్ మొలుగూరి కొంరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ మొలుగూరి సంపత్, సంగాల మహేష్, మొలుగూరి వెంకటయ్య, మొలుగూరి రవి, మొలుగూరి ఐలయ్య, కనకం వినోద్, మారుపాక సుమన్ గ్రామస్తులు పాల్గొన్నారు.