Marupaka Vinay: ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచాలి :యూత్ వైస్ ప్రెసిడెంట్ మారుపాక వినయ్

సిరాన్యూస్‌, సైదాపూర్
ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచాలి :యూత్ వైస్ ప్రెసిడెంట్ మారుపాక వినయ్
* ఉపాధి హామీ కూలీల‌కు మ‌జ్జిగ పండ్లు పంపిణీ

ఉపాధి హామీ కార్మికుల‌కు ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచాల‌ని వెన్నంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారుపాక వినయ్ అన్నారు. మంగ‌ళ‌వారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల‌కు వెన్నంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారుపాక వినయ్ ఆధ్వర్యంలో చల్లనినీరు, మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో టెంట్లు ఏర్పాటు, మజ్జిగ, మంచినీళ్లు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాలని, ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచాలని, వేసవి రోజుల్లో పని చేసే కూలీలకు అదనపు కూలీ ఇవ్వాలి డిమాండ్ చేశారు. బీజేపీ సెంట్రల్ లో అధికారంలోకి వచ్చాక ఈ చట్టంలో పలు సవరణలు చేసిందని, ఉద్దేశ పూర్వకంగా ఈ చట్టాన్ని నీరుగార్చేలా సరవణలు చేపట్టిందని ఆరోపించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు గరిష్టవేతనం అందడం లేదని, ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలతో పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్ల ఏర్పాటు, మజ్జిగ ఫ్యాకెట్ల పంపిణీ, తాగునీరు వంటి సౌకర్యాలు లేక సమీప బోరుల్లో నుంచి ఇంటిల్లో నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి వస్తోంది అన్నారు. కొన్ని వారాలుగా వేతనాలు పెండింగ్‌ లోనే ఉంటున్నాయని, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎటువంటి పనుల్లేకపోవడంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా ఉందని, తప్పని పరిస్థితుల్లో ఉపాధిహామీని నమ్ముకొన్న తరుణంలో ఈ పనులపైనే కూలీలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *