సిరా న్యూస్, బేల
కాంగ్రెస్లో చేరిన మసాలా(బి) బీఆర్ఎస్ నాయకులు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మసాలా (బి) గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండి సుజాత సుదర్శన్, తాజా మాజీ మండల ఉపాధ్యక్షులు మంగళవారం అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట మసాలా(బి), భాది, హేటి పలైతాండ, గ్రామస్తులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు నీరుపేదలకు జీవన ఆధారం అని అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవర్, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాన్ ఖేడే,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,కౌన్సిలర్ ఆవుల వెంకన్న,నాయకులు పోరెడ్డి కిషన్, షకీల్ సింగిరెడ్డి రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ మినక సుధామ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మినక నగేష్ రెడ్డి ,అశోక్ రెడ్డి,విలాస్ సవాపురే ,గోపతి శంకర్,సుంకరి శ్రీనివాస్, దంతేలా వినోద్, మాడవి చంద్రకాంత్, నాగర్కర్ శంకర్, రావుల సోమన్న,రతన్ రెడ్డి, బాస సంతోష్, ఘనశ్యం గౌండే, శంకర్ భోక్రె, సాగర్ టాక్రె,ఎల్మ రామ్ రెడ్డి, గ్రామస్తులు రమేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.