సిరా న్యూస్, ఖానాపూర్
మస్కాపూర్ విశ్వబ్రాహ్మణ నూతన సంఘం ఎన్నిక
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ విశ్వబ్రాహ్మణ నూతన సంఘాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా గ్రామం సీఎం రావు ఫంక్షన్ హాల్ లో సంఘ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గౌరవ అధ్యక్షులుగా తునికి రాజన్న, అధ్యక్షలుగా మండజీ మురళి, ఉపాధ్యక్షులుగా సజ్జనపు నాగేంద్రబాబు, కోశాధికారిగా గాంధారి సురేష్ , ప్రధాన కార్యదర్శిగా వనపర్తి నరేందర్ చారి, కార్యదర్శిగా ఉల్లెంగుల రాజేశ్వర్, సలహాదారులుగా కొత్తూరి విశ్వనాథ చారి,వనపర్తి మునీంద్ర చారి ఎన్నుకున్నారు. ఈసందర్బంగా నూతన సభ్యులను ఘనంగా సన్మానించారు.