సిరాన్యూస్, భీమదేవరపల్లి
జూన్ 21న జర్నలిస్ట్ యూనియన్ సమావేశం :యూనియన్ బాధ్యులు మాట్ల హరికుమార్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఈనెల 21 జర్నలిస్ట్ యూనియన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యూనియన్ బాధ్యులు మాట్ల హరికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ముల్కనూర్ రైతు వేదిక వద్ద జర్నలిస్ట్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. కాగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండ్లు, ఇంటి స్థలాలు సాధించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. మండలంలోని జర్నలిస్టులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.