మే 1 నవృధ్యాప్య పెన్షన్లు చెల్లించాలి

సిరా న్యూస్,అమరావతి;
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్డీఏ కూటమి నేతల బృందం కలిసింది. మే ఒకటవ తేదీ వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి చేసింది.
దేవినేని ఉమా మాట్లాడుతూ ఏప్రిల్ లో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించిన 13వేలకోట్ల రూపాయల బిల్లులను ఖజానా ఖాళీచేసి చెల్లించారు. ఏప్రిల్ మూడవ తారీకు వరకు సచివాలయాల వద్ద పెన్షన్ దారులకు డబ్బులు చేరక 33 మంది లబ్ధిదారులు చనిపోయారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని కొమ్ము కాస్తున్నాడు నారా చంద్రబాబునాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు 24వ తేదీన లేఖ రాశారు. దానిపై 26వ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయి. ఉద్దేశపూర్వక కాలయాపన చేయకుండా మే ఒకటవ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఉద్యోగి 20 మందికి చొప్పున ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్ళి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. శవ రాజకీయాలు చేస్తూ మంత్రి జోగి రమేష్ చనిపోయిన వృద్ధురాలిని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అటువంటి సంఘటనలో పునరావృతం కాకూడదు ఈ నెలలో 30వ తేదీ కల్లా పెన్షన్ డబ్బులు మ్యాపింగ్ చేసి.. మే ఒకటవ తేదీ 6 గంటలకల్లా ప్రతి ఇంటికి పంపించాలి. మానవతా దృక్పథంతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కాలయాపన చేసే కార్యక్రమం ఈరోజు కనపడింది. దురదృష్టకర సంఘటనలు పురావృతం అయితే దానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. జిల్లా కలెక్టర్లకు వారికున్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని చీఫ్ సెక్రటరీకి చెప్పి డోర్ టు డోర్ ఇంటివద్దె పెన్షన్లు ఇవ్వాలని కోరారు.
===============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *