సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆత్రం సక్కును పార్లమెంట్కు పంపిద్దాం: జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్
* గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం
ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును పార్లమెంట్కు పంపిద్దామని జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి ఆత్రం సక్కును పార్లమెంటుకు పంపాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.ఒకసారి కాంగ్రెస్ కు ఓటు వేసి గోస పడుతున్నామని, ఈసారి కష్టపడి కారును గెలిపిద్దామని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిందని దానికి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెబుదామని అన్నారు.