సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ అన్నారు.
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీ ఒకటవ వార్డులోని ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.