సిరా న్యూస్, ఆదిలాబాద్:
మహాయజ్ఞంలా అన్నదానం…
+ నేటితో 146 వారాలు పూర్తి
+ సంగెం సేవలకు అభినందనల వెల్లువ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుపేదల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదానం నేటి ఆదివారంతో 146 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ్య న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం స్థానికలు సంతోష్, వేల్పుల సుధీర్లు ముఖ్య అతిథిలుగా హాజరై అన్నదానం గావించారు. దీంతో వారిని సంగెం సుధీర్ శాలువా కప్పి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన చుట్టూ ఉన్న సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారిలో కొంత మంది ఆకలినైన తీర్చాలనే సంకల్పంతో, ప్రతీ ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్విగ్నంగా, ఒక యజ్ఞంలాగా కొనసాగించేందుకు సహాయా సహాకారాలు అందించిన ప్రతీ ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మహేందర్ రెడ్డి, సలీం, శుభాష్, అంబయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.