Medical Officer Dr. Kiran Kumar: విద్యార్థులు పరిశుభ్రత పాటించాలి:  వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌
విద్యార్థులు పరిశుభ్రత పాటించాలి:  వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్

విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని ఇచ్చోడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ‌ మండల కేంద్రంలోని టిటిడబ్ల్యూఆర్ బాలుర పాఠశాల, పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. 35 మంది విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ భోజనం చేసే సమయం లో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, శారీరక ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. విద్యార్థులకు వచ్చే సంక్రమిత, అసంక్రమిత వ్యాధులతో పాటు, సీజనల్‌ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *