సిరాన్యూస్, ఇచ్చోడ
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి కిరణ్
* ఇస్లాంపూర కాలనీలో ఉచిత వైద్య శిబిరం
సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇచ్చోడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిరణ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపూర కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్బంగా ఈ వైద్య శిబిరంలో మధుమేహం, అధిక రక్త పోటు, జ్వర పీడుతులకు సంబంధించిన వాటిపై ఇతర వ్యాధులకు సంబంధించిన నలభై మూడు మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ జ్వర బాధితుల రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కిరణ్ మాట్లాడుతూ వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతా యన్నారు. వాటి వల్ల డెంగ్యూ, చికున్గున్యాయా, మలేరియా, టైపాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ ఉత్తమ్ సింగ్, అసిస్టెంట్ రాజ్ కిరణ్ రెడ్డి, కైలాస్ రాథోడ్, సుభాష్, ఏఎన్ఎం పద్మ, వసంత్, సుభాష్, బ్రీడింగ్ క్రాకర్స్, ఆశ కార్యకర్త పాల్గొన్నారు.