సిరా న్యూస్, బేల
కాంగ్రెస్అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం :మాజీ సర్పంచ్ మీనాక సుదాం రెడ్డి
కాంగ్రెస్అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని అవాల్పూర్ మాజీ సర్పంచ్ మీనాక సుదాం రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా అవాల్పూర్ మాజీ సర్పంచ్ మీనాక సూద్దాం రెడ్డి ఆధ్వర్యంలో సిర్సన్న గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి క్యాంపెయిన్ చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సుదాం రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. ప్రతి వస్తువు పైన టాక్స్ వేసి పేద మధ్యతరగతి కుటుంబాలపైన భారం మోపుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. ఆత్రం సుగుణక్కను పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్లెం మల్లా రెడ్డి, ఊరడే మోరశ్వర్, ముక్కే దీపక్, వెంకట్ రెడ్డి, కాట్ పెళ్లి ప్రతాప్ రెడ్డి, కిష్టా రెడ్డి, హరీష్ రెడ్డి, షేక్ నజీర్, కిష్టాన్న, నడుకుంటి ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.