తెలుగు యువత
సిరా న్యూస్,గొనేగండ్ల;
ఎన్నికల్లో యువత ఓట్ల కోసం జగన్ మోహన్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని టిడిపి యూత్ మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు,ఉపాధ్యక్షులు ఐరన్ బండ ముల్లా బాషా,పిలిగుండ్ల జయపాల్అన్నారు. గొనేగండ్ల తెలుగు యువత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీఎన్నికలు 60 రోజులు ఉండగా ఇదిగో డీఎస్సీ అనీ ఉద్యోగ ప్రకటన ప్రభుత్వం ఇవ్వడం మభ్య పెట్టడం కాదా అన్నారు.2019 ఎన్నికల ముందు గతంలో నిరుద్యోగులకు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదలచేస్తాం,రాష్ట్రంలో ఖాళీగా వున్న 23 వేల ఉపాధ్యాయ నియామకాలు నియమిస్తామని అనీ గద్దెను ఎక్కి,నేడు నిరుద్యోగులను నట్టేట ముంచిన ఈ వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నిరుద్యోగులుసిద్దంగా ఉన్నారని అన్నారు.ఈ వైసీపీ 4 న్నర ఏళ్ల పాలనలో ఒక్క సారి కూడా డీఎస్సీ వేయకుండా కేవలము ఎన్నికలు 60 రోజులు ఉండగా అది కూడా ఎన్నికల కోడ్ వచ్చే సమయంలో 6100 ఉపాధ్యాయనియామకాలు నియమిస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా జగన్ మోహన్ రెడ్డి.అందులో టెట్ నిర్వహణ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తారా?లేక టెట్ నిర్వహించి డీఎస్సీ నిర్వహిస్తారా?టెట్ నిర్వహిస్తే ఎన్నికల సమయంలో ఏ రోజు పెడతారు?డీఎస్సీ నిర్వహిస్తే ఎన్నికల సమయంలో ఏ రోజు పెడతారు జగన్ మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు.ముమ్మాటికీ ఇది గత సంవత్సరంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సిఎన్నికల్లో వైసీపీకి నిరుద్యోగులు వాత పెట్టడం చూసి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరుద్యోగులు మళ్ళీ వాత పెడతరేమో అనీ భయపడి ప్రభుత్వం మెగా డిఎస్సీ అనీ ఉడుత ఊపులు మొదలెట్టింది.నిరుద్యోగులు అన్నీ
గమనిస్తున్నారు మా టిడిపి హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి రద్ధు, బిసి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లా ద్వారా యువతకు ఉపాధి కల్పన రద్దు,మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయనీ త్వరలోనే చంద్రన్న పాలనలోమళ్ళీ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అన్నారు.ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఇంటికి పంపాలని అన్నారు