Memorandam: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి

ఆదిలాబాద్, సిరా న్యూస్ 

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

అదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌజింగ్ బోర్డ్ పరిధిలోని సర్వే నంబర్ 161/ A లో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్ శైలజను తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా దుకాణాల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. అధికారుల ముందే ఇంత అక్రమణలు జరుగుతున్న పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈ నిర్మాణాల కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో నాటిన ఏళ్లనాటి చెట్లను కూడా నరికి వేశారని ఆవేదన వ్యక్తం చేశాు.
రోడ్డుపైనే ఇంత దర్జాగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.పట్టణంలో ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జా కాకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ హార్ఫాత్, ఎస్సీ సెల్ నియోజకవర్గ చైర్మన్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *