బేల, సిరా న్యూస్
మద్యం, మాంసం దకాణాలు మూసివేయాలి
ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో తహసీల్దార్, ఎస్ఐలకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆ రోజు ఎలాంటి తప్పులు జరగకుండా మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచాలని కోరారు. కార్యక్రమంల భజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్, మండల ఉపాధ్యక్షుడు ప్రీతం, బేల టౌన్ అధ్యక్షుడు, భరకాడే అనికేత్, సామాజిక కార్యకర్త భరకాడే రాము పాల్గొన్నారు.