Memorandam: 22న మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని వినతి

బేల, సిరా న్యూస్ 

మద్యం, మాంసం దకాణాలు మూసివేయాలి

ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో తహసీల్దార్, ఎస్ఐలకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆ రోజు ఎలాంటి తప్పులు జరగకుండా మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచాలని కోరారు. కార్యక్రమంల భజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్, మండల ఉపాధ్యక్షుడు ప్రీతం, బేల టౌన్ అధ్యక్షుడు, భరకాడే అనికేత్, సామాజిక కార్యకర్త భరకాడే రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *