Mesram Rajeshwar: బీజేపీ ఎంపీ అభ్యర్థి రేసులో మేస్రం రాజేశ్వర్‌…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:
బీజేపీ ఎంపీ అభ్యర్థి రేసులో మేస్రం రాజేశ్వర్‌…
+ 1996 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం
+ వివిధ క్షేత్రాలు, సంఘాల్లో పనిచేసిన అనుభవం
+ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలకు బయోడాట అందజేత
+ రాజేశ్వర్‌కు టికెట్‌ ఖాయమంటున్న అభిమానులు

ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి టికెట్‌కు విపరీతమైన పోటీ నెలకొనడంతో, ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు బీజేపీ పెద్దల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. అయితే ఈ సారి ఆదిలాబాద్‌ బీజేపీ టికెట్‌ కొత్త ముఖాలకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అదిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విధేయతకు పెద్ద పీట వేస్తూ, పార్టీ సిద్దాంతాలను ఏళ్లుగా మోస్తున్నవారికే ఈ సారి పార్టీ టికెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఈ సారి ఎంపీ టికెట్‌ అందించనున్నట్లు అధిష్ఠానం నుంచి సంకేతాలు వెలువడినట్లు అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. కాగా 1996 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో వివిధ హోదాల్లో సేవలందించిన మేస్రం రాజేశ్వర్‌ రావు టికెట్‌ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు అవకాశం కలిపిస్తే మాత్రం రాజేశ్వర్‌కు ఎంపీ టికెట్‌ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యావంతుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయుడు, ఆదివాసీ పర్ధాన్‌ తెగకు చెందిన మేస్రం రాజేశ్వర్‌కే ఎంపీ టికెట్‌ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. కాగా మేస్రం రాజేశ్వర్‌ ఇప్పటికే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి, ఇతర జాతీయ స్థాయి నేతలను కలిసి తన బయోడాటాను అందించారు. ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ తనకు కేటాయించాలని విన్నవించారు.

1996 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం…
క్రమ శిక్షణకు మారుపేరైనటువంటి ఆర్‌ఎస్‌ఎస్‌లో మేస్రం రాజేశ్వర్‌ సైతం 1996 నుంచి ఎంతో క్రమశిక్షణగా వివిద హోదాల్లో పనిచేస్తూ… ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయుడిగా పేరుతెచ్చుకున్నాడు. 1998లో భైంసాలో ప్రాథమిక శిక్షా వర్గ పూర్తి చేసిన ఆయన ఆర్‌వీకే హైదరాబాద్‌లో ప్రథమ వర్ష పూర్తి చేసాడు. కాగా జైనథ్‌ శాఖ ముఖ్య శిక్షక్‌గా, జైనథ్‌ ఖండ ప్రముఖ్‌గా, పర్యటన కార్యకర్తగా, జిల్లా సహాకార్యవహాగా అనేక హోదాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆయన పనిచేసారు. సామాజిక సమరసత వేధిక జిల్లా ప్రముఖ్‌గా, వనవాసీ కళ్యాణ్‌ పరిషత్‌ జిల్లా సహా కార్యదర్శిగా, జనజాతి సురక్షా మంచ్‌ జిల్లా కో కన్వీనర్‌గా, శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ జిల్లా సహా సంయోజక్‌గా, శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా సేవ ప్రముఖ్‌గా, హిందూ సమాజ్‌ ఉత్సవ సమితి సంఘటన్‌ మంత్రిగా, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యార్శిగా, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇలా ఎన్నో సంఘాల్లో క్రియాశీలక పదవుల్లో పనిచేసిన ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆదిలాబాద్‌ ప్రజలకు సుపరిచితులుగా నిలిచారు. దాదాపుగా గత 30ఏళ్లుగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలే ఆయువుగా, హిందూ ధర్మ పరిరక్షణే పరమావధిగా సంఘం కోసం పనిచేస్తున్నారు. సంఘంలో పనిచేసిన అపారమైన అనుభవంతో పాటు సమాజంలో సమస్యలపై స్పష్టమైన అవగాహణ, ప్రజా సేవా చేయాలనే ధృడ సంకల్పం ఉన్న మేస్రం రాజేశ్వర్‌కు ఈ సారి ఎంపీ టికెట్‌ ఇస్తే, ఎంపీ స్థానం గెలవడంతో పాటు ఆదిలాబాద్‌ అభివృద్ధికి సైతం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిమానులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ప్రొఫైల్‌:

పేరు:

మేస్రం రాజేశ్వర్‌ రావు (ఎమ్మెస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ)

తండ్రి పేరు:

మేస్రం కేశవ్‌రావ్‌ (రిటైర్డ్‌ ప్రధానోపాద్యాయులు)

తల్లి పేరు: మేస్రం భాగ్యలక్ష్మీ
భార్య పేరు: మేస్రం మంజూల
కూమార్తె పేరు: మేస్రం వేద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *